26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి

పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు కల్పన దిశగా సీఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎల్లారెడ్డి గూడ జయప్రకాష్ నగర్ కాలనీ, ఇంజనీర్స్ కాలనీలో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ హైదరాబాద్ విశ్వ నగరం అజెండాగా అభివృద్రి చేయాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు.

జూబ్లీ హిల్స్ నియోజక వర్గంలో ప్రతి డివిజన్ లో సీసీ రోడ్లు ,పార్క్ లు తాగునీటి సరఫరా డ్రైనేజ్ వ్యవస్థ శానిటేషన్ తో క్లీన్ అండ్ గ్రీన్ గా కాలనీలు ఉంచి ,పరిశుభ్రత పాటిస్తూ మెరుగైన జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.హైదరాబాద్ నగర అబివృద్ధి కొనసాగేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కార్పొరేటర్ సంగీత స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Related posts

హెరిటేజ్‌కి రాయితీలు… అసలు లెక్క ఇది.. తప్పేముంది జగన్‌…?

Satyam News

సిగ్నల్‌ రహిత ప్రయాణమే లక్ష్యంగా 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌ లు

Satyam News

తెలంగాణ రీసైక్లింగ్ సర్వీస్: పాత పేరు.. కొత్త ప్యాకింగ్!

Satyam News

తాటి ఈత వనాలు దగ్ధం కాకుండా మనమే చూసుకోవాలి

Satyam News

తమ్ముడు అకౌంట్‌ నుండి జగన్‌కి…. పీఏ పట్టించేశాడు…!!

Satyam News

మళ్లీ బీజేపీ రాజకీయాల్లోకి వరుణ్ గాంధీ?

Satyam News

Leave a Comment