ఆధ్యాత్మికంహోమ్

భక్తులతో పోటెత్తిన మృత్యుంజయ కుంట

కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో వెలసిన సర్వమంగళ దేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి అర్చకులు విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శివనామ స్మరణతో మృత్యుంజయ కుంట పరిసరాలు మారుమోగిపోతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ఆవరణలో భక్తులు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.

మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం స్వామి వార్లకు వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిపించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అలాగే అర్థరాత్రి వేళ అత్యంత పవిత్రమైన లింగోద్భవ కాల పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.

Related posts

సినీ నటి జయవాహిని కన్నుమూత

Satyam News

మేడారం జంపన్నవాగులో జలకళ

Satyam News

తిరుమల ముంతాజ్ హోటల్ భూమి పై వాస్తవాలు ఇవి

Satyam News

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ రెడీ… ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు

Satyam News

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Satyam News

ఫెమీనా మిస్ ఇండియా గా యశికా శర్మ

Satyam News

Leave a Comment