ఆధ్యాత్మికంహోమ్

భక్తులతో పోటెత్తిన మృత్యుంజయ కుంట

కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో వెలసిన సర్వమంగళ దేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి అర్చకులు విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శివనామ స్మరణతో మృత్యుంజయ కుంట పరిసరాలు మారుమోగిపోతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ఆవరణలో భక్తులు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.

మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం స్వామి వార్లకు వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిపించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అలాగే అర్థరాత్రి వేళ అత్యంత పవిత్రమైన లింగోద్భవ కాల పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.

Related posts

వజ్రాల వ్యాపారి కిడ్నాప్: రూ.44 కోట్లు చెల్లింపు

Satyam News

అమరావతి ఖర్చుపై వైసీపీ ఫేక్ ప్రచారం… అసలు లెక్కలు ఇవే…!!

Satyam News

ఆందోళనకర పరిస్థితి లోకి మళ్ళీ న్యూఢిల్లీ

Satyam News

వ్యూహాత్మకంగా లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి కోలుకోలేని దెబ్బ?

Satyam News

సిరిసిల్ల వడ్ల కొనుగోలు కేంద్రం పరిశీలించిన కేటీఆర్

Satyam News

రాజకీయ పాఠశాల ప్రజాస్వామ్యానికి పునాది..

Satyam News

Leave a Comment