26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

భక్తులతో పోటెత్తిన మృత్యుంజయ కుంట

కడప నగరంలోని మృత్యుంజయ కుంటలో వెలసిన సర్వమంగళ దేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి, అమ్మవారికి అర్చకులు విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శివనామ స్మరణతో మృత్యుంజయ కుంట పరిసరాలు మారుమోగిపోతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ఆవరణలో భక్తులు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.

మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం స్వామి వార్లకు వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిపించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అలాగే అర్థరాత్రి వేళ అత్యంత పవిత్రమైన లింగోద్భవ కాల పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.

Related posts

Film Update: అల్లూ అర్జున్ ‘రాకా’ పోస్టర్ విడుదల

Satyam News

రాయల సీమ ద్రోహి ఎవరో తేల్చేసిన మంత్రి నిమ్మల

Satyam News

బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులపై పాక్ ప్రతీకారం

Satyam News

ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే తో వనపర్తి చిన్నారెడ్డి

Satyam News

పల్నాడులో ఫ్యాక్షనిజం చేయనివ్వం

Satyam News

గోదావరి పుష్కరాల నాటికి భద్రాద్రి వైభవం!

Satyam News

Leave a Comment