మహబూబ్ నగర్హోమ్

ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే తో వనపర్తి చిన్నారెడ్డి

#MallikarjunaKharge

ఏఐసిసి అధ్యక్షుడు రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ (వనపర్తి) డాక్టర్ జీ. చిన్నారెడ్డి భేటీ అయ్యారు. న్యూఢిల్లీలోని ఇంద్రభవన్ లో జరిగిన ఈ భేటీలో ఖర్గేకు పూల బొకే ఇచ్చి రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులపై చిన్నారెడ్డి చర్చించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని కొనసాగించిందని, రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని ఖర్గేకు చిన్నారెడ్డి వివరించారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా చేస్తున్న కృషిని మల్లికార్జున్ ఖర్గే అభినందించారని చిన్నారెడ్డి తెలిపారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

బీచ్ లో పేలుడు: 11 మంది మృతి

Satyam News

ట్రంప్ హెచ్చరికలతో వణుకుతున్న ఇరాన్

Satyam News

నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ పై మోడీ స్పందన

Satyam News

వైసీపీ ‘అనుబంధ’ పోలీసు ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

Satyam News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కు సర్వం సన్నద్ధం

Satyam News

అందరికీ ఆరాధ్యులు పొట్టి శ్రీరాములు

Satyam News

Leave a Comment