25.7 C
Hyderabad
September 21, 2026
ప్రపంచంహోమ్

నేపాల్ వ్యాప్తంగా నిషేధాజ్ఞలు: రంగంలో సైన్యం

#Nepal

నేపాల్ దేశవ్యాప్తంగా అల్లర్లను అడ్డుకోవడానికి నేపాల్ సైన్యం బుధవారం ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు అమలు చేసింది. అనంతరం గురువారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. సైన్యం విడుదల చేసిన ప్రకటనలో ఈ అంశాలను పేర్కొన్నది.

ఈ సమయంలో ఎలాంటి ఆందోళనలు, ధ్వంసం, అగ్నిప్రమాదాలు, వ్యక్తులపై దాడులు లేదా ఆస్తులపై దాడులు జరిపితే అవి నేరకృత్యాలుగా పరిగణించి కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. అల్లర్ల పేరుతో దోపిడీ, దహనం, ఇతర విధ్వంసక కార్యకలాపాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నందునే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.

“వ్యక్తులపై అత్యాచారం, హింసాత్మక దాడుల ముప్పు కూడా ఉంది” అని సైన్యం తెలిపింది. నేపాల్ రాజధాని ఖాట్మండులో బుధవారం జరిగిన అల్లర్లలో పార్లమెంట్ భవనం కాలిపోయి దెబ్బతిన్నది. థపాథళి ప్రాంతంలో కార్ల షోరూం ధ్వంసమై మంటలకు ఆహుతైంది.

రాజధాని వీధులు దాదాపు ఖాళీగా కనిపించాయి. అత్యవసర సేవల వాహనాలు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, ఆరోగ్య సిబ్బంది, భద్రతా దళాలకు మాత్రం రాకపోకల అనుమతి ఉంటుందని సైన్యం స్పష్టం చేసింది. 19 మంది మరణానికి కారణమైన పోలీసుల కాల్పుల ఘటనలపై నిరసనల మధ్య, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.

ఆయన రాజీనామా చేసినా కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జెన్-జడ్ యువత ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేకంగా, అలాగే ప్రభుత్వం అమలు చేసిన సోషల్ మీడియా నిషేధంపై సోమవారం భారీ నిరసనలు చెలరేగాయి. ఈ నిరసనల సందర్భంగా పోలీసుల కాల్పుల్లో 19 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు.

ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సోషల్ మీడియా నిషేధాన్ని సోమవారం రాత్రే ఎత్తివేశారు. అయితే నిరసనకారులు ఆగ్రహంతో పార్లమెంట్, రాష్ట్రపతి భవనం, ప్రధాని నివాసం, ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, కొంతమంది పెద్దల ఇళ్లకు నిప్పుపెట్టారు.

Related posts

నవంబరు నుంచి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు

Satyam News

విదేశాల్లో ఉద్యోగం పేరుతో మోసం

Satyam News

కేసీఆర్‌ వదిలిన బాణం…. ఏపీ పాలిట శాపం..!!

Satyam News

టెన్త్‌లో ఫ‌లించిన వంద‌రోజుల ప్ర‌ణాళిక‌

Satyam News

జగన్ చేసిన తప్పులే ప్రజలకు శాపాలు

Satyam News

చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు

Satyam News

Leave a Comment