29.2 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కిరణ్ కుమార్

#BarCouncilOfIndia

తెలంగాణ నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) సభ్యుడిగా ఎన్నికైన జి. కిరణ్ కుమార్ నేడు న్యూఢిల్లీలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా తో పాటు పలువురు బీసీఐ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి పదవీకాలం ముగించుకుంటున్న బీసీఐ సభ్యులు విష్ణు వర్ధన్ రెడ్డి కూడా కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

కిరణ్ కుమార్ సిద్దిపేటలో జన్మించి పెరిగారు. ఆయన తల్లిదండ్రులు బాల కిషన్ రావు, రాధ. ఆయన భార్య సుచిత్ర, పిల్లలు సుక్షిత్, అక్షిత్. కిరణ్ కుమార్ గత 25 సంవత్సరాలకు పైగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ, న్యాయవాదుల సమస్యలు మరియు సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పనిచేస్తున్నారు. ఆయన మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ (MCCBA), నాంపల్లి, హైదరాబాద్లో జనరల్ సెక్రటరీగా, అనంతరం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

బార్ అసోసియేషన్‌లో ఆయన పదవీకాలంలో న్యాయవాదుల కోసం పలు సంక్షేమ, మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు కృషి చేశారు.

బీసీఐ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిరణ్ కుమార్ మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించిన తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ న్యాయవాదుల సమస్యలు, అవసరాలు, వారి హక్కులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లి, న్యాయవాదుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి, గౌరవం, రక్షణ కోసం నిజాయితీగా పనిచేస్తానని తెలిపారు. అలాగే రాష్ట్ర బార్ కౌన్సిళ్లను మరింత బలోపేతం చేయడం, న్యాయవాదులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను జాతీయ స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేయడం తన ప్రధాన లక్ష్యాలలో భాగమని కిరణ్ కుమార్ తెలిపారు

Related posts

సింధు జలాల కోసం అల్లాడిపోతున్న పాకిస్తాన్

Satyam News

మోదీ-చంద్రబాబు భేటీ వెనుక అసలు కథ!

Satyam News

భారత్ నుంచి గల్ఫ్ వెళ్లే విమానాలు రద్దు

Satyam News

పెద్దకుమార్తె పిలుస్తోందని ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

Satyam News

మంగళగిరిని మంత్రి లోకేష్‌ ఏం చేయబోతున్నారు?

Satyam News

వైభవంగా “బాపు బొమ్మ – విశ్వ మహిళ” అవార్డ్స్ ప్రదానోత్సవం

Satyam News

Leave a Comment