సినిమాహోమ్

సినీ దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు పర్యావరణ పురస్కారం

సినీ రంగం లో నిత్య ప్రయోగశీలి, ప్రకృతి ప్రేమికుడు డా. పీసీ ఆదిత్య కు ప్రతిష్టత్మాక పర్యావరణ రక్షణ పురస్కారం లభించింది. సినీ దర్శకుడిగా ఆదిత్య తన 30 సంవత్సరాల ప్రయాణం లో అధిక చలన చిత్రాలు, లఘు చిత్రాలు సహజ ప్రకృతి అందాల మధ్య, పర్యావరణ పరిరక్షణ కు ప్రాధాన్యత నిస్తూ, దాదాపు ప్రతీ చిత్రం లో సందేశం ఇస్తూనే ఉన్నారు.

ఆదిత్య తన చిత్రాల షూటింగ్స్ అధిక శాతం అవుట్ డోర్ లో తీయడానికే ఇష్ట పడతారు. తెర పై పచ్చ దనాన్ని చూపించడానికే ఆలోచిస్తారు. ఇవన్నీ గుర్తించిన కోహినూర్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు జూన్ 5 వ తేది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా EXCELLENCE ENVIRONMENT PROTECTOR AWARD. 2026 ని అందజేశారు. సంస్థ అధినేత్రి దాసరి స్వప్న మహేష్ వివరిస్తూ పర్యావరణ ప్రేమికుడు, సీనియర్ దర్శకులు డా. పీసీ ఆదిత్య వంటి లెజెండ్ ని ఈ అవార్డు తో సత్కారించడం గర్వం గా ఉందన్నారు.

అవార్డు గ్రహీత ఆదిత్య స్పందిస్తూ పచ్చని పల్లెటూరు నుండి భాగ్యనగర్ కి వచ్చి దర్శకుడిగా స్థిరపడ్డా, ప్రకృతి అన్నా, పర్యావరణమ్ అన్నా ఎంతో ప్రేమిస్తానని తన ప్రతీ చిత్రం లో ప్రకృతి గురించి సందేశం ఇస్తున్నానని.. భవిష్యత్ లో కూడా తన వంతు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆదిత్య కు అభిమానులు, మిత్రులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియ జేశారు.

Related posts

‘పోలీస్ కంప్లైంట్’ చిత్ర యూనిట్‌ను అభినందించిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

Satyam News

ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

Satyam News

పౌర్ణమి సందర్భంగా శ్రీశైల గిరిప్రదక్షిణ

Satyam News

స్వీయ జనగణన ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు

Satyam News

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న స్వామీజీ

Satyam News

జల విహార్ వద్ద అట్టహాసంగా కైట్ ఫెస్టివల్

Satyam News

Leave a Comment