సినిమాహోమ్

సినీ దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు పర్యావరణ పురస్కారం

సినీ రంగం లో నిత్య ప్రయోగశీలి, ప్రకృతి ప్రేమికుడు డా. పీసీ ఆదిత్య కు ప్రతిష్టత్మాక పర్యావరణ రక్షణ పురస్కారం లభించింది. సినీ దర్శకుడిగా ఆదిత్య తన 30 సంవత్సరాల ప్రయాణం లో అధిక చలన చిత్రాలు, లఘు చిత్రాలు సహజ ప్రకృతి అందాల మధ్య, పర్యావరణ పరిరక్షణ కు ప్రాధాన్యత నిస్తూ, దాదాపు ప్రతీ చిత్రం లో సందేశం ఇస్తూనే ఉన్నారు.

ఆదిత్య తన చిత్రాల షూటింగ్స్ అధిక శాతం అవుట్ డోర్ లో తీయడానికే ఇష్ట పడతారు. తెర పై పచ్చ దనాన్ని చూపించడానికే ఆలోచిస్తారు. ఇవన్నీ గుర్తించిన కోహినూర్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు జూన్ 5 వ తేది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా EXCELLENCE ENVIRONMENT PROTECTOR AWARD. 2026 ని అందజేశారు. సంస్థ అధినేత్రి దాసరి స్వప్న మహేష్ వివరిస్తూ పర్యావరణ ప్రేమికుడు, సీనియర్ దర్శకులు డా. పీసీ ఆదిత్య వంటి లెజెండ్ ని ఈ అవార్డు తో సత్కారించడం గర్వం గా ఉందన్నారు.

అవార్డు గ్రహీత ఆదిత్య స్పందిస్తూ పచ్చని పల్లెటూరు నుండి భాగ్యనగర్ కి వచ్చి దర్శకుడిగా స్థిరపడ్డా, ప్రకృతి అన్నా, పర్యావరణమ్ అన్నా ఎంతో ప్రేమిస్తానని తన ప్రతీ చిత్రం లో ప్రకృతి గురించి సందేశం ఇస్తున్నానని.. భవిష్యత్ లో కూడా తన వంతు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా ఆదిత్య కు అభిమానులు, మిత్రులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియ జేశారు.

Related posts

బాధ్యతలు స్వీకరించిన సుమలత

Satyam News

లిక్కర్ స్కామ్‌: నోటు ముక్క ఫొటోతో దొరికిపోయిన కారుమూరి.!

Satyam News

పొగాకు రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం

Satyam News

వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్న నేతలు

Satyam News

పాకిస్థాన్ ను చిత్తు చేసిన టీమిండియా

Satyam News

నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డు సందర్శించిన కేటీఆర్

Satyam News

Leave a Comment