వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇందు ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ ఆదివారం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉన్న రోడ్డుపై కుటుంబ సభ్యులు రోడ్డుపైనే పడి విలపిస్తూ రోదించడం అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది.
మా బిడ్డ ప్రాణాలు పోయాయి..మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు” అంటూ మృతురాలి తల్లిదండ్రులు రోదించారు. దీంతో పోలీసులు రంగంలోకి ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, వారు వినకపోవడంతో పోలీసులు ధర్నా చేస్తున్న వారిని బలవంతంగా రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులకు, మృతురాలి బంధువులకు మధ్య తీవ్ర తోపులాట జరిగి ఆసుపత్రి పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి.
