ప్రత్యేకం హోమ్

భారత్ లో పట్టుబడ్డ పాకిస్తాన్ యువ జంట

#Pakistan

పాకిస్తాన్ నుంచి పారిపోయి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన ఒక యువ జంటను సరిహద్దు దళాలు పట్టుకున్నాయి. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భారత–పాకిస్థాన్ సరిహద్దులో వారిని అదుపులోకి తీసుకున్నారు. దేశంలోకి ఆ యువ జంట అడుగుపెట్టగానే భద్రతా బలగాల చేతికి చిక్కారు. సోమవారం ఈ ఘటన జరిగింది.

బీఎస్‌ఎఫ్ సిబ్బంది అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చిన ఈ జంటను గుర్తించి నిర్బంధించారని పోలీసులు తెలిపారు. బాలాసర్ పోలీస్ స్టేషన్ అధికారుల సమాచారం ప్రకారం, 24 ఏళ్ల పొపట్, 20 ఏళ్ల గౌరీ అనే ఈ యువతీయువకులు ఆదివారం రాత్రి తమ గ్రామం నుంచి పారిపోయారు. ఆ గ్రామం అంతర్జాతీయ సరిహద్దు నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందని పోలీసులు పేర్కొన్నారు.

అక్కడి నుంచి నడచుకుంటూ సరిహద్దు వైపు బయలుదేరిన వారు సోమవారం ఉదయం సరిహద్దులోని 1016వ స్తంభం సమీపంలోకి చేరుకున్నారు. ఆ సమయంలో పహారా కాస్తున్న బీఎస్‌ఎఫ్ జవాన్లు వీరిని గుర్తించి విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారి కుటుంబాలు వారి ప్రేమ, పెళ్లికి వ్యతిరేకంగా ఉండటంతో ఇద్దరూ కలిసి పారిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

భారత్‌లోకి ప్రవేశించడంలో ఎలాంటి దురుద్దేశం లేదని, కలిసి జీవించడానికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత భద్రతా సంస్థలు మరింత విచారణ చేపట్టనున్నాయి. ఇప్పటివరకు ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని అధికారులు పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో గత రెండు నెలల్లో ఇలాంటి రెండో ఘటన ఇదేనని పోలీసులు గుర్తించారు. అక్టోబర్ 8న కూడా ఇలాంటి విధంగా సరిహద్దు దాటిన ఇద్దరు వ్యక్తులను బీఎస్‌ఎఫ్ అదుపులోకి తీసుకున్నట్టు గుర్తుచేశారు.

Related posts

ములకలచెరువు ‘దొంగలు’ దొరుకుతారా?

Satyam News

జగన్‌ ఆట కట్టించిన చంద్రబాబు

Satyam News

అమరావతి నిర్మాణంలో వైజాగ్‌ స్టీల్‌…. కూటమి ప్రభుత్వం ఉక్కు మద్దతు..!!

Satyam News

Leave a Comment

error: Content is protected !!