సమాజంలో మీడియా పాత్ర కీలకమైనదని కె.శరత్ కుమార్ రాజు అన్నారు. కడప జిల్లా రాజంపేట మండలం వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ రాజంపేట ఆధ్వర్యంలో 40 సంవత్సరాల వేడుకలు తాళ్లపాక శాన్వి ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. సమాజంలో జరిగే మంచి చెడులను సమర్థ వంతంగా ప్రచురిస్తూ, చూపిస్తూ వాటిని పరిష్కరించే గొప్పతనం మీడియాదని శరత్ కుమార్ అన్నారు.
ఈ సందర్భంగా ప్రింట్ మరియు మీడియా కు చెందిన సూర్య దిన పత్రిక రాజంపేట పట్టణ ఇంచార్జి అలీ అక్బర్ షేర్,సీనియర్ ఎన్టీవీ జర్నలిస్ట్ దార్ల శ్రీనివాసులు ఆచారి,99 టివి రిపోర్టర్ సురేష్,మహాటివి రిపోర్టర్ శివా,6 టీవీ రిపోర్టర్ ప్రసాద్,సుమన్ టీవీ రిపోర్టర్ సుధాకర్, సీనియర్ రిపోర్టర్ గాడి అశోక్ రెడ్డి లను వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ రాజంపేట కె.శరత్ కుమార్ రాజు వారి బృందం మహిళా చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ విజయ లక్ష్మీ,జిల్లా గవర్నర్ రామచంద్రా రెడ్డి,ప్లాటినం డోనర్ మురళి కృష్ణా తదితరులు శాలువా కప్పి సత్కరించారు.

