ముఖ్యంశాలుహోమ్

రమ్య టైపు ఇన్స్టిట్యూట్ విద్యార్థినికి రాష్ట్ర స్థాయి ర్యాంక్

ఎస్.బి.టెట్ ఫిబ్రవరి 2026లో నిర్వహించిన టైప్ రైటింగ్ పరీక్షలలో తెలుగు హయ్యర్ గ్రేడ్ లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఏపీ టైప్ రైటింగ్ & షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడల్స్, ప్రశంసా పత్రాలను ప్రదానోత్సవ కార్యకమం జరిగింది.

ఆదివారం గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఉషారాణి, హెచ్ఓడి శంకరరావు హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలుగు హయ్యర్ 3వ ర్యాంక్ సాధించిన నరసరావుపేటలోని రమ్య టైపు ఇన్స్టిట్యూట్ విద్యార్థిని కుమారి షేక్. ఫాతిమాకు మెడల్, ప్రశంసాపత్రం అందచేశారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరాములు, గౌరవ అధ్యక్షులు సీవీ. మోహనరావు, ప్రధాన కార్యదర్శి ఏజికే. మూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్. మహబూబ్ సుభాని, కోశాధికారి నరసింహులు, రాష్ట్రంలోని టైప్ ఇన్స్టిట్యూట్స్ ప్రిన్సిపాల్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related posts

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

Satyam News

మళ్ళీ విచారణ కు హాజరైన సునీల్ నాయక్

Satyam News

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

Satyam News

తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్

Satyam News

122 ఏండ్ల తర్వాత తెరుచుకోనున్న ‘కోణార్క్‌’ గర్భ గుడి

Satyam News

వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్ కి కృష్ణా జలాలు

Satyam News

Leave a Comment