టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహానికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వార్త జోరుగా షికారు చేస్తోంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్నారంటూ ప్రచారంలో ఉన్న టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా ఒక పురాతన ప్యాలెస్లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ నెల (ఫిబ్రవరి) 26న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరగబోతోంది. వివాహం అనంతరం సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.
వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్:
సోషల్ మీడియాలో లీక్ అయిన పత్రిక ప్రకారం.. “మేము ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం.. మా జీవితంలో ఇదొక పెద్ద అడుగు. ఫిబ్రవరి 26న కేవలం కుటుంబ సభ్యుల మధ్య మా వివాహం జరుగుతుంది. మార్చి 4న సాయంత్రం 7 గంటల నుంచి రిసెప్షన్ వేడుక ఉంటుంది” అని అందులో పేర్కొన్నారు.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై మ్యాజిక్ చేసింది. అప్పటి నుంచే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. గత ఏడాది అక్టోబర్లోనే వీరిద్దరికీ రహస్యంగా నిశ్చితార్థం జరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు పెళ్లి కార్డు కూడా బయటకు రావడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ, విజయ్ లేదా రష్మిక వైపు నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన (Official Confirmation) వెలువడలేదు.
