ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ విజయవాడ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ షేక్ హసన్ బాషా సలహా సూచనల మేరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌస్ పీర్ ఆధ్వర్యంలో ఐదవ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో హజ్ కమిటీ డైరెక్టర్లు జనాబ్ మహబూబ్ బాషా, జనాబ్ మీరా సాహెబ్, జనాబ్ మీర్జా అబీద్ హుస్సేన్, జనాబ్ యన్. బాబా ఫక్రుద్దీన్, జనాబ్ పఠాన్ ఖాదర్ ఖాన్, సాహేబా ఎస్. రేష్మా పర్వీన్, జనాబ్ షేక్ అబ్దుల్ హుస్సేన్, జనాబా సూరి మన్సూర్ అలీ, జనాబ్ సయ్యద్ షాజి సుల్తాన్ ముసవి, సాహేబా షేక్ జబీన్ పాల్గొన్నారు. 2026 హజ్ యాత్రకు వెళ్లబోయే హాజీల కోసం మరింత సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఎలా చేయాలి, 2025 హజ్ సందర్భంగా హాజీలకు ఎదురైన అసౌకర్యాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు ఎలా తీసుకోవాలి, విజయవాడ ఎంబర్కేషన్ పాయింట్ను మరింత అభివృద్ధి చేయడం, ప్రతి హాజీకి ప్రభుత్వ సహకారం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవడం వంటి ముఖ్య అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అదేవిధంగా విజయవాడ హజ్ హౌస్ స్థలం మరియు భవన నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వ సహకారాన్ని సాకారం చేసుకోవడంపై కూడా సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే జనాబ్ నసీర్ అహ్మద్ పాల్గొన్నారు.
previous post
next post
Satyam News
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
