కేటిదొడ్డి మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం అమవాస్య సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల భక్తులతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా భక్తులు ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు.
భక్తులు స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య సందర్భంగా స్వామి వారి కల్యాణోత్సవాని నిర్వహిస్తున్నారు. అమావాస్య సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని చలువనీడలు ఏర్పాటు చేశారు.
