ముఖ్యంశాలుహోమ్

గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో భారీగా పతనమైన రూపాయి

#IndianRupee

డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి శుక్రవారం ఇంట్రా-డే ట్రేడింగ్‌లో భారీగా పడిపోయింది. కొత్త ఆల్‌టైమ్ పతనం నమోదు అయి 94.70ను తాకింది. పెరిగిన అంతర్జాతీయ చమురు ధరలు, బలపడుతున్న అమెరికా డాలర్, అలాగే పశ్చిమ ఆసియా సంక్షోభంలో ఎలాంటి పురోగతి లేకపోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి 94.18 వద్ద ప్రారంభమై క్రమంగా పడిపోతూ 94.50 మార్క్‌ను దాటి 94.70 వరకు చేరింది. ఇది గత ముగింపు స్థాయితో పోలిస్తే 74 పైసల పతనంగా నమోదైంది. అంతకుముందు బుధవారం రూపాయి 20 పైసలు పడిపోయి 93.96 వద్ద ముగిసింది. శ్రీరామ నవమి సందర్భంగా గురువారం స్టాక్, ఫారెక్స్, కమోడిటీ, బులియన్ మార్కెట్లు మూసివేశారు.

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర పతనం, అలాగే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) నిరంతర అమ్మకాలు కూడా రూపాయిపై అదనపు ఒత్తిడిని కలిగించాయి. ఫారెక్స్ ట్రేడర్ల ప్రకారం, ఆయిల్ కంపెనీలు డాలర్ల కొనుగోలు కొనసాగించడం, ఎగుమతిదారులు తమ డాలర్ ఆదాయాలను నిలిపివేయడం, దిగుమతిదారులు చెల్లింపుల కోసం డాలర్లు కొనుగోలు చేయడం వంటి అంశాలు రూపాయి బలహీనతకు దారితీశాయి.

డాలర్ బలాన్ని కొలిచే డాలర్ ఇండెక్స్ 0.08 శాతం పెరిగి 99.67 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ ప్రమాణంగా పరిగణించే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 107.4 డాలర్ల వద్ద ఉంది.

దేశీయ స్టాక్ మార్కెట్లలో కూడా తీవ్ర నష్టాలు నమోదయ్యాయి. సెన్సెక్స్ 1,190.76 పాయింట్లు (1.58%) పడిపోయి 74,082.69 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 352.25 పాయింట్లు (1.51%) క్షీణించి 22,954.20 వద్ద ఉంది.

బుధవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 1,805.37 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్లు ఎక్స్చేంజ్ డేటా వెల్లడించింది.

Related posts

తనకు రక్షణ కల్పించండంటూ గర్భిణి వేడుకోలు

Satyam News

ఐబీ నూతన డైరెక్టర్ గా మహేష్ దీక్షిత్

Satyam News

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విజయవంతంగా శస్త్ర చికిత్స

Satyam News

War effect: పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు

Satyam News

వైసీపీ మళ్లీ గెలవదు…. క్లారిటీ ఇచ్చేసిన జగన్‌..!!

Satyam News

అసోమ్ రాష్ట్రంలో ఇక ఉమ్మడి పౌరసత్వ బిల్లు

Satyam News

Leave a Comment