అనంతపురంహోమ్

రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్ సహాయం

రెండేళ్లలోని 650 మందికి ఆరున్నర కోట్ల రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ కింద మేము సాయం చేస్తే.. గత వైసిపి హయాంలో కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వలేదని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం అర్బన్ టిడిపి కార్యాలయంలో ఆయన ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

మొత్తం 18 మందికి 11 లక్షల 30 వేల రూపాయల కు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని అన్నారు. ఓవైపు ప్రజల ఆరోగ్యంతో పాటు సంక్షేమం, అభివృద్ధి సమపాలెంలో ముందుకు తీసుకెళుతున్నారన్నారు.

గత ఐదేళ్లలో జగన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు పెట్టి పోతే.. కేవలం ఏడాదిలోని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పింఛన్లు కూడా అందిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ చొరవతో 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షలు ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు…

Related posts

వారంలో ఒక రోజు నో వెహికల్ డే

Satyam News

యుద్ధంలో ముగ్గురు భారతీయ సీఫేరర్ల మృతి

Satyam News

కోటప్పకొండ తిరునాళ్లకు రూ.30 లక్షలు మంజూరు

Satyam News

గోదావరి పుష్కరాలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

Satyam News

పోలవరం ప్రాజెక్ట్ లో సి ఎస్ ఎం ఆర్ ఎస్ బృందం పరీక్షలు

Satyam News

ప్రతి రోజూ సూర్యరశ్మి సోకితే…….

Satyam News

Leave a Comment