26.7 C
Hyderabad
September 20, 2026
అనంతపురంహోమ్

రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్ సహాయం

రెండేళ్లలోని 650 మందికి ఆరున్నర కోట్ల రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ కింద మేము సాయం చేస్తే.. గత వైసిపి హయాంలో కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వలేదని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం అర్బన్ టిడిపి కార్యాలయంలో ఆయన ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

మొత్తం 18 మందికి 11 లక్షల 30 వేల రూపాయల కు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని అన్నారు. ఓవైపు ప్రజల ఆరోగ్యంతో పాటు సంక్షేమం, అభివృద్ధి సమపాలెంలో ముందుకు తీసుకెళుతున్నారన్నారు.

గత ఐదేళ్లలో జగన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు పెట్టి పోతే.. కేవలం ఏడాదిలోని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పింఛన్లు కూడా అందిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ చొరవతో 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షలు ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు…

Related posts

ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారానికి భారీ విరాళాలు

Satyam News

బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్టు

Satyam News

డీఎంకే పంచన చేరిన పనీర్ సెల్వం

Satyam News

బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులపై పాక్ ప్రతీకారం

Satyam News

మరింత ప్రభావం చూపించనున్న అల్పపీడనం

Satyam News

గోవా గవర్నర్ అశోక్ నర్మగర్భ వ్యాఖ్యలు

Satyam News

Leave a Comment