ప్రత్యేకంహోమ్

బ్రెజిల్ లో లిథియం మైనింగ్ కి సింగరేణి

తాము చేపట్టిన లిథియం మైనింగ్ లో సింగరేణి సంస్థ భాగస్వామిగా చేరాలని కోరుతూ బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ సి.బి.ఎల్ సంస్థ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సింగరేణి ఛైర్మన్, ఎండీ డాక్ట‌ర్‌ బుద్దప్రకాష్ జ్యోతిని కలిసి వివరాలను తెలియజేసింది.

సి.బి.ఎల్ (కంపాన్హియా బ్రసిలీరా డి లిటియో) బోర్డు డైరెక్టర్ డేనియల్ లెమే, సి.బి.ఎల్ సీఈవో వినీసియస్ అల్వారెంగా తమ కంపెనీ వివరాలను తెలియజేశారు. బ్రెజిల్ దేశంలో ఇప్పటికే తాము లిథియం మైనింగ్ చేపట్టామని, సింగరేణి సంస్థ కీలక ఖనిజాల పట్ల ఆసక్తితో ఉన్న నేపథ్యంలో తమ కంపెనీలో భాగస్వామిగా చేరినట్లయితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వారు వివరించారు. తాము సింగరేణి తో పాటు దేశంలోని ప్రముఖ కంపెనీలను కూడా సంప్రదిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేడు ప్రపంచంలో లిథియం కీలక ఖనిజానికి ఉన్న ప్రాధాన్యత, వ్యాపార కోణంలో ఉన్న లాభదాయకత గురించి వివరించారు.

సింగరేణి సంస్థకు సంబంధించిన వివరాలను డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పర్సనల్ మరియు ఫైనాన్స్ గౌతమ్ పోట్రు వివరించారు. బ్రెజిల్ దేశంలో కీలక ఖనిజ అవకాశాలను, లాభదాయకత తదితర అంశాలను తాము చర్చించి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Related posts

బందరు పోర్టు కు ఇప్పుడు ‘చంద్ర’ కళ

Satyam News

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు పండుగ

Satyam News

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరుమెదపరేం

Satyam News

అబద్ధం సుబ్బారెడ్డిది…. సాక్ష్యం ఫోటోలది

Satyam News

పల్నాడులో ఫ్యాక్షనిజం చేయనివ్వం

Satyam News

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ..విజయసాయికి నోటీసులు..??

Satyam News

Leave a Comment