నెల్లూరుహోమ్

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్

#ChandrababuN

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లా మైపాడు గేటులో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ను వర్చువల్‌గా ప్రారంభించారు. రూ. 7 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్ కంటెయినర్ షాపులు వీధి వ్యాపారులకు స్థిరమైన వ్యాపార వేదికను కల్పించనున్నాయి. ఈ మార్కెట్‌లో మొత్తం 30 మోడ్యులర్ కంటెయినర్లతో 120 షాపులు ఏర్పాటు చేశారు.

ప్రతి కంటెయినర్‌లో 4 షాపులు ఉండేలా ప్రభుత్వం వినూత్నంగా రూపకల్పన చేసింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ స్మార్ట్ వెండింగ్ మార్కెట్ ద్వారా మహిళలు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వీధి వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా స్థిరమైన వ్యాపారం చేసుకునే వేదికను ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ కొత్త ఆలోచనకు ప్రశంసలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఉమర్ ఖాలిద్ కు బెయిల్ నిరాకరించిన సుప్రీం కోర్టు

Satyam News

సవరించిన జీవో ప్రకారం కొత్త అక్రెడిటేషన్ లు

Satyam News

తిరుమలలో ఘనంగా పార్వేటు ఉత్సవం

Satyam News

అమెరికా ఆయిల్ టాంకర్ పై ఇరాన్ దాడి?

Satyam News

‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్ ఆవిష్కరణ

Satyam News

అమెరికాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ‘మీట్ అండ్ గ్రీట్’

Satyam News

Leave a Comment