నెల్లూరుహోమ్

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్

#ChandrababuN

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లా మైపాడు గేటులో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ను వర్చువల్‌గా ప్రారంభించారు. రూ. 7 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్ కంటెయినర్ షాపులు వీధి వ్యాపారులకు స్థిరమైన వ్యాపార వేదికను కల్పించనున్నాయి. ఈ మార్కెట్‌లో మొత్తం 30 మోడ్యులర్ కంటెయినర్లతో 120 షాపులు ఏర్పాటు చేశారు.

ప్రతి కంటెయినర్‌లో 4 షాపులు ఉండేలా ప్రభుత్వం వినూత్నంగా రూపకల్పన చేసింది. ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ స్మార్ట్ వెండింగ్ మార్కెట్ ద్వారా మహిళలు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వీధి వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా స్థిరమైన వ్యాపారం చేసుకునే వేదికను ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ కొత్త ఆలోచనకు ప్రశంసలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఛైర్మన్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఫ్రాన్స్ లో తెలంగాణ శాసన బృందం పర్యటన

Satyam News

ఇరాన్ యుద్ధంపై త్వరలో శుభవార్త

Satyam News

చీటీల పేరుతో ఘరానా మోసం…!

Satyam News

డిసెంబర్ 6న ఆశ్రా జాతీయ సదస్సు

Satyam News

ట్రంప్ హెచ్చరికలతో అట్టుడుకుతున్న గల్ఫ్

Satyam News

రికార్డు స్థాయిలో వృద్ధిరేటు నమోదు

Satyam News

Leave a Comment