ప్రత్యేకంహోమ్

రథసప్తమి రోజు చేయాల్సింది ఏమిటి?

సూర్యుడు అవతరించిన మాఘశుక్ల సప్తమి ,సూర్య జయంతి అనీ, రథసప్తమి అనీ ప్రసిద్ధికెక్కింది. మాఘ సప్తమినాడు సూర్యభగవానుడు రెండవసారి అవతరించాడు. సూర్యుని మెుదటి అవతారం వివస్వంతుడు.

అదితికి, కశ్యపునికి పుత్రునిగా రెండవసారి అవతరించాడు. ఆయనకు అదితి పుత్రుడు కనుక ఆదిత్యుడని, కశ్యప పుత్రుడు కనుక కాశ్యపేయుడనీ పేరు వచ్చింది. రథసప్తమి నాడు ఆవు పేడ ద్వారా తయారైన పిడకలపై క్రొత్త కుండలో కానీ లేదా ఇత్తడి పాత్రతో కానీ, ఆవు పాలతో పాయసం వండి చిక్కుడు కాయల రథం మీద, చిక్కుడు ఆకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి, ఆపై ప్రసాదాన్ని స్వీకరించినవారు సకల పాపాల నుండి విముక్తిని పొంది, ఆరోగ్యాన్ని పొందుతారు.

ఈనాడు సూర్యుడు ఏడు గుర్రాలు పొదిగిన రథం మీద పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్య కాలంలో పయనిస్తూ లోకాన్ని సంతోష పెడతాడు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే స్నానం చేయాలి. అప్పుడే మాఘస్నాన ఫలితం వస్తుంది. ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసి చేతిలోకి నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వాలి.

Related posts

పాకిస్థాన్ – అఫ్గాన్ సరిహద్దుల్లో యుద్ధ జ్వాలలు

Satyam News

కాళేశ్వరంపై హరీష్ రావు ఘాటు లేఖ

Satyam News

నవంబరు నుంచి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు

Satyam News

సీలైన్ సర్వీసెస్ సంస్థ ఎం డి గరగ స్వామిని అభినందించిన బుర్ర

Satyam News

పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జూలకంటి

Satyam News

విజయ్ తో కలిసి జగన్ ‘మత’ ఫ్రంట్… తోడు కేటీఆర్

Satyam News

Leave a Comment