ప్రత్యేకంహోమ్

రథసప్తమి రోజు చేయాల్సింది ఏమిటి?

సూర్యుడు అవతరించిన మాఘశుక్ల సప్తమి ,సూర్య జయంతి అనీ, రథసప్తమి అనీ ప్రసిద్ధికెక్కింది. మాఘ సప్తమినాడు సూర్యభగవానుడు రెండవసారి అవతరించాడు. సూర్యుని మెుదటి అవతారం వివస్వంతుడు.

అదితికి, కశ్యపునికి పుత్రునిగా రెండవసారి అవతరించాడు. ఆయనకు అదితి పుత్రుడు కనుక ఆదిత్యుడని, కశ్యప పుత్రుడు కనుక కాశ్యపేయుడనీ పేరు వచ్చింది. రథసప్తమి నాడు ఆవు పేడ ద్వారా తయారైన పిడకలపై క్రొత్త కుండలో కానీ లేదా ఇత్తడి పాత్రతో కానీ, ఆవు పాలతో పాయసం వండి చిక్కుడు కాయల రథం మీద, చిక్కుడు ఆకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి, ఆపై ప్రసాదాన్ని స్వీకరించినవారు సకల పాపాల నుండి విముక్తిని పొంది, ఆరోగ్యాన్ని పొందుతారు.

ఈనాడు సూర్యుడు ఏడు గుర్రాలు పొదిగిన రథం మీద పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్య కాలంలో పయనిస్తూ లోకాన్ని సంతోష పెడతాడు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే స్నానం చేయాలి. అప్పుడే మాఘస్నాన ఫలితం వస్తుంది. ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసి చేతిలోకి నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వాలి.

Related posts

ట్రంప్ భార్యపై సినిమా: 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Satyam News

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ – వైసీపీ పొత్తు…?

Satyam News

పాగుంట వెంకన్న స్వామి ఆలయానికి పోటెత్తిన‌ భక్తజనం

Satyam News

ఈడబ్ల్యూఎస్ క్రెడిట్ కో అపరేటివ్ సొసైటీల ఏర్పాటు

Satyam News

బంగ్లాదేశ్ ను కుదిపేసిన భూ కంపం

Satyam News

దూసుకువస్తున్న సేన్యార్ తుఫాన్

Satyam News

Leave a Comment