26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

రథసప్తమి రోజు చేయాల్సింది ఏమిటి?

సూర్యుడు అవతరించిన మాఘశుక్ల సప్తమి ,సూర్య జయంతి అనీ, రథసప్తమి అనీ ప్రసిద్ధికెక్కింది. మాఘ సప్తమినాడు సూర్యభగవానుడు రెండవసారి అవతరించాడు. సూర్యుని మెుదటి అవతారం వివస్వంతుడు.

అదితికి, కశ్యపునికి పుత్రునిగా రెండవసారి అవతరించాడు. ఆయనకు అదితి పుత్రుడు కనుక ఆదిత్యుడని, కశ్యప పుత్రుడు కనుక కాశ్యపేయుడనీ పేరు వచ్చింది. రథసప్తమి నాడు ఆవు పేడ ద్వారా తయారైన పిడకలపై క్రొత్త కుండలో కానీ లేదా ఇత్తడి పాత్రతో కానీ, ఆవు పాలతో పాయసం వండి చిక్కుడు కాయల రథం మీద, చిక్కుడు ఆకులు వేసి దాని మీద పాయసం పెట్టి సూర్యునికి నివేదించి, ఆపై ప్రసాదాన్ని స్వీకరించినవారు సకల పాపాల నుండి విముక్తిని పొంది, ఆరోగ్యాన్ని పొందుతారు.

ఈనాడు సూర్యుడు ఏడు గుర్రాలు పొదిగిన రథం మీద పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్య కాలంలో పయనిస్తూ లోకాన్ని సంతోష పెడతాడు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడే స్నానం చేయాలి. అప్పుడే మాఘస్నాన ఫలితం వస్తుంది. ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసి చేతిలోకి నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వాలి.

Related posts

జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Satyam News

రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించేది లేదు

Satyam News

సింహ వాహనంపై యోగ నరసింహ అలంకారంలో శ్రీ మలయప్ప

Satyam News

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన ధర్మేంద్ర

Satyam News

సోనియా గాంధీ కేసు హైకోర్టు కు….

Satyam News

SIR పై అనుమానాలు వ్యక్తం చేస్తూ 23 రాజకీయ పార్టీల లేఖ

Satyam News

Leave a Comment