26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

పోలీసుల వేధింపులతో ఉర్దూ అకాడమీ ఉద్యోగి ఆత్మహత్య?

#UrduAcadamy

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఉర్దూ అకాడమీ ఉద్యోగి షేక్ దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. తన మరణానికి పిడుగురాళ్ల సీఐ శ్రీరామ్ వెంకట్రావు వేధింపులే కారణమని ఆయన రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్, మరణ వాంగ్మూలం వెలుగులోకి రావడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

సమాచారం ప్రకారం, ఒక ఇంటి స్థల వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, అదే అంశంపై సీఐ వెంకట్రావు పలుమార్లు తనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధించారని దరియా హుస్సేన్ ఆరోపించినట్లు తెలుస్తోంది. ఇల్లు ఖాళీ చేయాలని, లేకపోతే గంజాయి కేసు నమోదు చేస్తానంటూ బెదిరించారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.

తాను మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని, పోలీసుల వేధింపులను భరించలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నానని దరియా హుస్సేన్ రాసినట్లు సమాచారం. తన మరణానికి బాధ్యులుగా పిడుగురాళ్ల సీఐ శ్రీరామ్ వెంకట్రావుతో పాటు ఇద్దరు పోలీసు సిబ్బంది, మరో ఇద్దరు వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.

విషాదకర విషయం ఏమిటంటే, తన పుట్టినరోజు రోజే ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నానని, మనశ్శాంతి లేక జీవితం కొనసాగించలేకపోతున్నానని దరియా హుస్సేన్ సూసైడ్ లెటర్‌లో పేర్కొన్నారు. సూసైడ్ నోట్‌లో పోలీసు అధికారుల పేర్లు ప్రస్తావించబడటంతో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరణ వాంగ్మూలం, సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. అయితే, దరియా హుస్సేన్ చేసిన ఆరోపణలపై అధికారికంగా పోలీసుల స్పందన ఇంకా వెలువడలేదు.

Related posts

ఉల్లాస్ అక్షరాంధ్రతో 100% అక్షరాస్యత లక్ష్యం

Satyam News

గ్రామ పంచాయతీలకు రూ.387 కోట్లు విడుదల

Satyam News

చ‌ర్చ‌లు స‌ఫ‌లం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బ‌స్సులు

Satyam News

రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

Satyam News

“ఆపరేషన్ వజ్రప్రహార్” లో 13 బైక్స్ సీజ్‌

Satyam News

హోర్మోజ్ జలసంధి నుంచి 90 శాతం ట్యాంకర్ల బంద్

Satyam News

Leave a Comment