క్రీడలుహోమ్

రెండో టీ20లో భారత్ ఘనవిజయం

న్యూజిలాండ్ పై భారత్ సంచలన విజయం సాధించింది భారీ లక్ష్యాన్ని చేజ్ చేసిన టీమిండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. మరో 28 బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని ఫినిష్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.

209 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్ చేధించింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ సంచలన బ్యాటింగ్ చేశారు. హాఫ్ సెంచరీలతో చెలరేగారు.ఇషాన్ 32 బంతుల్లో 76 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 సిక్సులు, 11 ఫోర్లు ఉన్నాయి.

ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంకసర బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లోనే 82 పరుగులు బాది జట్టుకి విజయాన్ని అందించాడు. సూర్య ఇన్నింగ్స్ లో 4 సిక్సలు, 9 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో శివమ్ దూబె మెరిశాడు. 18 బంతుల్లో 36 రన్స్ తో రాణించాడు. దూబె 3 సిక్సులు కొట్టాడు.

Related posts

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం

Satyam News

తిరుమల దండయాత్ర పై తోక ముడిచిన జగన్ ?

Satyam News

గ్రామీణ వ్య‌వ‌స్థ బ‌లోపేత‌మే విబి జి రామ్‌జి ప‌థ‌క లక్ష్యం

Satyam News

క్వాంటం డీప్ టెక్ లో అజేయ శక్తిగా అమరావతి

Satyam News

జగన్‌కి ముదిరిన మావిగన్‌ మైకం…. మందు లేదు బ్రదర్‌!

Satyam News

యశోద హాస్పిటల్స్ లో అత్యాధునిక “పల్స్ ఫీల్డ్ అబ్లేషన్” (PFA)

Satyam News

Leave a Comment