క్రీడలుహోమ్

రెండో టీ20లో భారత్ ఘనవిజయం

న్యూజిలాండ్ పై భారత్ సంచలన విజయం సాధించింది భారీ లక్ష్యాన్ని చేజ్ చేసిన టీమిండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. మరో 28 బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని ఫినిష్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.

209 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్ చేధించింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ సంచలన బ్యాటింగ్ చేశారు. హాఫ్ సెంచరీలతో చెలరేగారు.ఇషాన్ 32 బంతుల్లో 76 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 సిక్సులు, 11 ఫోర్లు ఉన్నాయి.

ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంకసర బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లోనే 82 పరుగులు బాది జట్టుకి విజయాన్ని అందించాడు. సూర్య ఇన్నింగ్స్ లో 4 సిక్సలు, 9 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో శివమ్ దూబె మెరిశాడు. 18 బంతుల్లో 36 రన్స్ తో రాణించాడు. దూబె 3 సిక్సులు కొట్టాడు.

Related posts

శ్రీ స్వామి రామానందుల వారి సమాధి ఆరాధన

Satyam News

టీఆర్ఎస్ నేతలపై సీతక్క అనుచరుల దాడి

Satyam News

కోచింగ్ సెంటర్ లో మంటలు: 15 మంది విద్యార్ధుల సజీవ దహనం

Satyam News

అనంతపురం యాపిల్స్‌.. . షిమ్లాకి పోటీగా సీమ రేగిపండ్లు

Satyam News

అయిజలో అంతర్జాతీయ మహిళా కబడ్డీ టోర్నమెంట్

Satyam News

బుడ్డాయిపల్లి లో దళితబంధు వాహనాలతో భారీ ర్యాలీ

Satyam News

Leave a Comment