శ్రీకాకుళంహోమ్

మత్స్యకార గ్రామంలో నిదురించనున్న కేంద్ర మంత్రి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోల్ ఇండియా సంస్థ సి.ఎస్.ఆర్ నిధులతో చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మత్స్యసాగర మాల ను రేపు ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో ప్రారంభించనున్నారు.

మొత్తంగా జిల్లాలో ఇప్పటికే 1594 లైట్లను ఏర్పాటు చెయ్యగా.. రెండవ విడత కూడా ప్రస్తుతం లైట్ల అమరిక ప్రక్రియ జరుగుతోంది. మొదటి విడత దిగ్విజయంగా పూర్తైన నేపధ్యంలో శుక్రవారం నాడు రామ్మోహన్ నాయుడు.. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ తో కలసి ప్రారంభించనున్నారు.

అనంతరం స్థానిక మత్స్యకార గ్రామాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి.. ఈ రెండేళ్ళ కాలంలో కూటమి సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్థానికులకు వివరించనున్నారు. అనంతరం ఎకువూరు, నడుమూరు గ్రామాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొని.. నడుమూరు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం లో భాగంగా అక్కడే నిదురించనున్నారు.

కేంద్ర మంత్రి చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం ఇప్పటికే శరవేగంగా ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేశారు.

Related posts

బీసీ నాయకుడి కాళ్లు విరగ్గొట్టిన వైసీపీ కార్యకర్తలు!

Satyam News

సరిహద్దు గ్రామాల్ని ముంచేసిన పాక్ పాలకులు

Satyam News

ఆ ఒక్క కారణంతో.. కూటమిలో తిరుగులేని ఐక్యత

Satyam News

తిరుమల శ్రీవారి పై కోపంతో కాశీబుగ్గ ఆలయ నిర్మాణం?

Satyam News

శ్రీ కపిలేశ్వరాలయంలో విశేష‌ పూజ హోమ మ‌హోత్స‌వాలు

Satyam News

జపాన్ లో తీవ్ర భూకంపం: సునామీ హెచ్చరిక

Satyam News

Leave a Comment