అమెరికాలోని సియాటెల్ లో పోలీసుల కారు ఢీకొని కందుల జాహ్నవి మరణించింది. కోటి ఆశలతో ఆంధ్రా నుంచి అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుతుండగా, అక్కడి పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని దుర్మరణం చెందింది. ఈ కేసు విచారణకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్స్ అంటే భారత్ కరెన్సీలో దాదాపు రూ.262 కోట్ల పరిహారం చెల్లించేందుకు వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ సిటీ ముందుకొచ్చింది. ఈ మేరకు అగ్రిమెంట్ జరిగింది. దీనిపై సిటీ అటార్నీ జనరల్ ఎరికా ఇవాన్స్ అధికారిక ప్రకటన చేశారు.
previous post
Satyam News
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
