ప్రత్యేకంహోమ్

‘భూభారతి’: భూసర్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పు

#Ponguleti

భూముల ప్రతి అంగుళాన్ని డిజిటలైజ్ చేసి రైతులకు శాశ్వత యాజమాన్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

గత ప్రభుత్వం ‘ధరణి’ ద్వారా సృష్టించిన సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు చుట్టంలా ఉండేలా ‘భూభారతి’ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్‌ (ఐడీఓసీ)లో శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు ఆయన ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

పాత టేపులు, గొలుసుల పద్ధతులకు స్వస్తి పలికి సెంటీమీటర్ల స్థాయిలో ఖచ్చితత్వం వచ్చేలా ఆధునిక ‘రోవర్స్‌’ సాంకేతికతను వినియోగిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే 600 రోవర్లను జిల్లాలకు పంపిణీ చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన 5,500 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను మండలాల వారీగా కేటాయించామని చెప్పారు.

ఖమ్మం జిల్లాలో రెండో విడతలో అర్హత సాధించిన 47 మందికి నియామక పత్రాలు అందజేశామని పేర్కొన్నారు.ధరణిలో జరిగిన అక్రమాలపై సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో ఫోరెన్సిక్‌ ఆడిట్‌ పూర్తయ్యిందని, త్వరలో మిగిలిన జిల్లాల్లోనూ ఆడిట్‌ చేపడతామని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ల అంశంలో ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

Related posts

పెరిగిపోతున్న షుగర్ డాడీ కల్చర్

Satyam News

ఇదీ రాజకీయమేనా? ఇలా ఎంతకాలం? 

Satyam News

అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం నవతరం పార్టీ కృషి

Satyam News

రియల్ హీరో సుధాకర్: పాములు పట్టి అడవుల్లో విడిచే సేవ

Satyam News

సత్వర ఫైళ్ల క్లియరెన్సుతో సత్వర సేవలు

Satyam News

ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హా నిబంధ‌న‌లు

Satyam News

Leave a Comment