యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు అదే విధంగా బూడిద నిల్వల మెయింటినెన్స్ సంబంధించిన సబ్జెక్టులో మేనేజ్మెంట్ ప్రైవేటు వ్యక్తులకు టెండర్లు మెయింటెనెన్స్ కోసం పిలిచింది. దాన్ని వ్యతిరేకిస్తూ గద్వాల విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నుంచి మంగళవారం మధ్యాహ్నము భోజన విరామం సమయంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది.
అదేవిధంగా బుధవారం కూడా యధావిధిగా ఈ నిరసన కార్యక్రమం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉంటుందనీ దాంట్లో భాగంగా గద్వాల ఎస్ ఈ ఆఫీసు ముందు విద్యుత్ ఉద్యోగులు పాల్గొని మేనేజ్మెంట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇచ్చిన టెండర్ నోటీసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సభ్యులు అశోక్, రంగయ్య, ప్రవీణ్, మాగబుల్, బాలస్వామి, రజిత, పద్మమ్మ, అంజనమ్మ, లక్ష్మి,కోమలి, ప్రసాద్,నాగరాజు,సురేశ్,భాస్కర్,రహీం, మీనా,క్రియ్య్ణవేణి,మహమూద్ సందీప్,అంజి,ఈదన్న పాల్గొన్నారు.
