జాతీయంహోమ్

గుట్టలు గుట్టలుగా రద్దయిన నోట్లు

#Cash

ఉత్తర ఢిల్లీలోని వజీర్‌పూర్ ప్రాంతంలో దాడి చేసిన పోలీసులు పెద్ద ఎత్తున రద్దయిన నోట్లు స్వాధీనం చేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అక్రమ నగదు రవాణా జరుగుతున్నట్టు వచ్చిన సమాచారంతో ఢిల్లీ పోలీసులు దాడి నిర్వహించగా, డీమానిటైజేషన్ తర్వాత అమోదం కోల్పోయిన పాత రూ.500, రూ.1,000 నోట్లతో నిండిన పలు సంచులు అక్కడ నుంచి బయటపడ్డాయి.

నగదుతో ఉన్న ఈ సంచులను స్వాధీనం చేసుకున్న సమయంలో అక్కడ ఉన్న పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ రద్దయిన కరెన్సీ రవాణాకు ఉపయోగించిన రెండు వాహనాలను కూడా పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఘటనలో భారీ మొత్తంలో రద్దయిన నోటలు ఉన్నట్లు తెలుస్తుండగా, వాటి మూలం ఏమిటనే దానిపై విచారణ కొనసాగుతోంది.

“స్వాధీనం చేసిన నగదు ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న నెట్‌వర్క్ ఏమిటన్న అంశాలపై అదుపులో ఉన్నవారిని ప్రశ్నిస్తున్నాము,” అని ఒక అధికారి తెలిపారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Related posts

గిరిజన విద్యార్ధులకు అండగా మంత్రి నారా లోకేష్

Satyam News

ధర్మేంద్ర కేవలం భర్త మాత్రమే కాదు….

Satyam News

సీనియర్ జర్నలిస్టు కొండ లక్ష్మారెడ్డి మృతి

Satyam News

జన నాయగన్ నా ఆఖరి చిత్రం

Satyam News

తప్పుడు మాటలతో తికమక జగన్

Satyam News

తిరుమలపై దండయాత్రకు వస్తున్న జగన్

Satyam News

Leave a Comment