చిత్తూరుహోమ్

తిరుచానూరు లో వైసీపీ గుండాల దౌర్జన్యం

తిరుచానూరులో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమ్మవారి ఆలయ సమీపంలో టిటిడి వాహన బేరర్లపై స్థానిక వైసీపీ తిరుచానూరు సర్పంచ్ రామచంద్ర రెడ్డి అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. కేవలం సైడ్ ఇవ్వలేదన్న చిన్న కారణంతో మొదలైన గొడవ పెద్ద ఘర్షణకు దారితీసింది.

పద్మావతి అమ్మవారి ఆలయంలో గజవాహన సేవ ముగిసిన తర్వాత చంద్రగిరి నుంచి వచ్చిన వాహన బేరర్లు తిరిగి వెళ్తున్నారు. గేట్ నంబర్ 1 వద్ద తిరుచానూరుకు చెందిన వైసిపి నేత వాసు అనే వ్యక్తితో సైడ్ ఇచ్చే విషయంలో వివాదం తలెత్తింది. దీంతో వాసు తన అనుచరులను పిలిపించి వాహన బేరర్లపై దాడి చేయించారు. ఈ దాడిలో టిటిడి వాహన బ్యారర్లు మహేష్ అనే వ్యక్తి తల పగలగా, లవకుమార్ సహా 5 మందికి పైగా గాయపడ్డారు.

ఘటన గురించి తెలుసుకున్న వాహన బేరర్ల బంధువులు చంద్రగిరి నుంచి పెద్ద సంఖ్యలో తిరుచానూరు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తిరుచానూరు వైసీపీ సర్పంచ్ తమ్ముడు నరేష్ రెడ్డి కూడా ఈ ఘటనలో ఉన్నాడు.

Related posts

కోస్తాలో వైసీపీ ఖాళీ..?? ఆ 5గురు మాజీ ఎమ్‌ఎల్‌ఏలు జంప్‌..??

Satyam News

మళ్లీ ఫేక్‌ సర్వేల గోల.. నిండా మునిగినా జగన్‌ మారడా..??

Satyam News

అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

Satyam News

18 న ఖమ్మం వస్తున్న సీఎం రేవంత్

Satyam News

రష్యాకు విమాన భాగాలు అమ్మిన వ్యక్తికి శిక్ష

Satyam News

యశోద హాస్పిటల్స్ లో అత్యాధునిక “పల్స్ ఫీల్డ్ అబ్లేషన్” (PFA)

Satyam News

Leave a Comment