చిత్తూరుహోమ్

తిరుచానూరు లో వైసీపీ గుండాల దౌర్జన్యం

తిరుచానూరులో శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమ్మవారి ఆలయ సమీపంలో టిటిడి వాహన బేరర్లపై స్థానిక వైసీపీ తిరుచానూరు సర్పంచ్ రామచంద్ర రెడ్డి అనుచరులు విచక్షణారహితంగా దాడి చేశారు. కేవలం సైడ్ ఇవ్వలేదన్న చిన్న కారణంతో మొదలైన గొడవ పెద్ద ఘర్షణకు దారితీసింది.

పద్మావతి అమ్మవారి ఆలయంలో గజవాహన సేవ ముగిసిన తర్వాత చంద్రగిరి నుంచి వచ్చిన వాహన బేరర్లు తిరిగి వెళ్తున్నారు. గేట్ నంబర్ 1 వద్ద తిరుచానూరుకు చెందిన వైసిపి నేత వాసు అనే వ్యక్తితో సైడ్ ఇచ్చే విషయంలో వివాదం తలెత్తింది. దీంతో వాసు తన అనుచరులను పిలిపించి వాహన బేరర్లపై దాడి చేయించారు. ఈ దాడిలో టిటిడి వాహన బ్యారర్లు మహేష్ అనే వ్యక్తి తల పగలగా, లవకుమార్ సహా 5 మందికి పైగా గాయపడ్డారు.

ఘటన గురించి తెలుసుకున్న వాహన బేరర్ల బంధువులు చంద్రగిరి నుంచి పెద్ద సంఖ్యలో తిరుచానూరు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తిరుచానూరు వైసీపీ సర్పంచ్ తమ్ముడు నరేష్ రెడ్డి కూడా ఈ ఘటనలో ఉన్నాడు.

Related posts

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం

Satyam News

ఒంటిమిట్ట శ్రీ కోదండరామునికి పుష్పయాగం

Satyam News

జోగినపల్లి కి ఫ్లోరా శైని సెల్యూట్

Satyam News

పారదర్శకంగా గ్యాస్ సిలిండర్ల సరఫరా

Satyam News

నేటి అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ

Satyam News

భార్య పిల్లల్ని చితక్కొట్టినా తప్పులేదు

Satyam News

Leave a Comment