ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ నాకు ఫోన్ చేశారు అని అమిత్ షా తెలిపారు. తాను ప్రస్తుతం సంఘటన స్థలానికి బయలుదేరానని, రేపు హోం మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటన దేశ రాజధానిలో తీవ్ర కలకలం రేపింది. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
