జాతీయంహోమ్

ఢిల్లీలో అగ్ని ప్రమాదం: 9 మంది మృతి

#DelhiFireAccident

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మరణించారు. ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఉన్న నివాస సముదాయంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక వివరాలు సూచిస్తున్నాయి. ఏసీ పేలుడు కారణంగా మంటలు చెలరేగినట్టు అనుమానం వ్యక్తమవుతోంది.

ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భవనంలో ఉన్న పలువురు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్లు, మరో నలుగురు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 14 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక దళాలు, రెస్క్యూ టీమ్స్ కలిసి సుమారు 10 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. ఇంకా భవనంలో మరికొందరు చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఏసీ పేలుడు నిజమైన కారణమా లేదా ఇతర కారణాలున్నాయా అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

Related posts

ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పిన 15 ఏళ్ల బాలిక

Satyam News

Karnataka Politics: ప్రియాంక్ ఖార్గేపై ఆర్ఎస్ఎస్ ఫిర్యాదు

Satyam News

తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు

Satyam News

ఉల్లి రైతుకు క్వింటాకు రూ.1200 చెల్లించి కొనుగోలు

Satyam News

నీట్ గా లీక్ చేసిన లెక్చరర్లు: మరొకరు అరెస్టు

Satyam News

ఇద్దరు పిల్లలు భార్యతో ఆత్మహత్య చేసుకున్న నావికుడు

Satyam News

Leave a Comment