ఆషాడ మాసం సందర్భంగా బర్కత్ పురలోని పీఎఫ్ కార్యాలయం ఆలయ ప్రాంగణంలోని దర్బార్ మైసమ్మ ఆలయంలో బోనాల వేడుకలను మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ పెండ్యాల రాంబాబు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. బోనాల వేడుకకు కమీషనర్లు తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్, శ్రీకాంత్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యాలయం మహిళాల ఉద్యోగులు, ఉద్యోగులు అమ్మవారికి బోనాం తొట్టెల సమర్పించారు. ఈ కార్యక్రమంలో బోనాల వేడుక కో ఆర్డినేటర్లు జి. వేణుగోపాల్, డి. అఖిలేష్ రెడ్డి, బి. సురేష్, ఆలయ ప్రధాన పూజారి రాంబాబు, ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్
