అంబర్ పేట మహంకాళీ దేవాలయం బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర సినిమా ఆటోగ్రాఫ్ మంత్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ కమిటి సభ్యులు ఆయనను ఘనంగా సత్కారించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అమ్మవారి కృప దయ అందరికి ఉంటుదని, ఆశీర్వాదం అందరికి అనుగ్రహిస్తుందని ప్రజలు సుఖసంతోషలతో పండుగను నిర్వహించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాన అనుచరుడు తొలుపు నూరి కృష్ణా గౌడ్, దుర్గా ప్రసాద్ రెడ్డి, మాజి కార్పొరేటర్లు పద్మవతి డీపీ రెడ్డి, గరిగంటి శ్రీదేవీ, పులి జగన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్, నాగేష్ గౌడ్, శ్రీదర్ గౌడ్, శ్రీమంత్ గిరి, చెంగల సుధాకర్, తొలుపు నూరి నరేష్ గౌడ్, అభిలాష గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట