జాతీయంహోమ్

కాక్రోచ్ లకు ఇంత డబ్బు ఎలా వచ్చింది?

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తండ్రి భగవాన్‌రావు దిప్కే ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలని కోరుతూ సూరత్‌కు చెందిన సమాచార హక్కు చట్టం (RTI) కార్యకర్త  అమిత్ తివారీ అధికారులను ఆశ్రయించారు. భగవాన్‌రావు దిప్కే నెలకు కేవలం రూ. 60,000 నుండి రూ. 65,000 వరకు మాత్రమే వేతనం పొందుతుండగా, అమెరికాలో తన పిల్లల ఉన్నత చదువుల ఖర్చులను ఆయన ఎలా భరించగలిగారనే దానిపై ఆ కార్యకర్త తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. తక్కువ పరిమిత ఆదాయం ఉన్నప్పటికీ, విదేశాలలో అంత భారీ మొత్తంలో చదువుల కోసం డబ్బు ఎలా సమకూరిందనే దానిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

భగవాన్‌రావు దిప్కే మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MIDC)లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ నెలకు రూ. 60,000 నుంచి రూ. 65,000 వరకు మాత్రమే వేతనం పొందే వారని, అంత తక్కువ ఆదాయంతో అమెరికాలో తన కొడుకు ఉన్నత చదువులకు అంత భారీ మొత్తంలో ఖర్చును ఎలా భరించగలిగారనే దానిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కావచ్చునని, దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.

అంతేకాకుండా, CJP అనేది ప్రజాప్రాతినిధ్య చట్టం కింద నమోదు కాబడని సంస్థ అయినప్పటికీ రాజకీయ పార్టీ పేరిట నిధులు స్వీకరించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఈ పార్టీకి సీనియర్ లాయర్, ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించిన రూ. 1 కోటి లీగల్ డిఫెన్స్ ఫండ్‌కు సంబంధించి 18% జిఎస్‌టి (GST) చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీబీఐసీ (CBIC)ని కోరారు.

Related posts

ఆటో డ్రైవర్ల పట్ల చంద్రబాబుకు ఈ అకస్మాత్తు ప్రేమ ఎందుకు?

Satyam News

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న సానా సతీష్

Satyam News

చరిత్రలో రథసప్తమి….. ప్రత్యేకత

Satyam News

పేరుకే ప్రభుత్వ ఉద్యోగి… జీవితమంతా జగన్ సేవ

Satyam News

ప్రధాని మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

Satyam News

గోదావరి పుష్కరాల నాటికి భద్రాద్రి వైభవం!

Satyam News

Leave a Comment