25.2 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

దీపావళి వేళ వంటవాడి అవతారం

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వేడుకలు జరుపుకున్నారు. ఆయన పాత ఢిల్లీలోని సుప్రసిద్ధ, చారిత్రక ఘంటేవాలా స్వీట్ షాపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఇమర్తి (జలేబీని పోలి ఉండే ఒక తీపి వంటకం), బేసన్ లడ్డూలు తయారు చేయడానికి ప్రయత్నించారు.

ఈ అనుభవాన్ని రాహుల్ గాంధీ ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ షాపులో తీపి వంటకాలు తయారు చేసే విధానాన్ని ఆయన ఆసక్తిగా గమనిస్తూ, ఇమర్తి పిండిని నూనెలో వేసి, లడ్డూలను ఉండలు చుట్టడంలో తన చేయి చేసుకున్నారు. ఈ సందర్భంగా దుకాణ యజమాని మాట్లాడుతూ, తమ కుటుంబం తరాల నుండి నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబాలకు స్వీట్లు అందించిందని, ఇప్పుడు రాహుల్ గాంధీ పెళ్లి సందర్భంగా మిఠాయి ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నామని సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి రాహుల్ గాంధీ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

ఈ వీడియోతో పాటు రాహుల్ గాంధీ ఒక సందేశాన్ని కూడా పంచుకున్నారు. “మీరు దీపావళిని ఎలా జరుపుకుంటున్నారు..? దీపావళి నిజమైన మాధుర్యం కేవలం పళ్లెంలోనే కాదు, బంధాలలో, సమాజంలో కూడా ఉంది” అని రాహుల్ గాంధీ దేశ ప్రజలను ప్రశ్నించారు. “మీరు మీ దీపావళిని ఎలా జరుపుకుంటున్నారు, దాన్ని ఎలా ప్రత్యేకంగా మారుస్తున్నారో మాతో పంచుకోండి” అని కోరారు.

మరో పోస్ట్‌లో దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ, “భారతదేశం ఆనందపు దీపాలతో ప్రకాశించాలని, సంతోషం, శ్రేయస్సు, ప్రేమ అనే వెలుగు ప్రతి ఇంటిలో వ్యాపించాలని” రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. ఈ విధంగా రాహుల్ గాంధీ సంప్రదాయ వంటకాలను తయారు చేస్తూ, పండుగ సందర్భంగా సామాజిక బంధాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

Related posts

స్వచ్ఛ శ్రీకాకుళం మన లక్ష్యం

Satyam News

ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి

Satyam News

రామ్‌గోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

Satyam News

అమరావతికి త్వరలో రాజధాని హోదా

Satyam News

మిడ్జిల్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

Satyam News

షరతులు పాటిస్తేనే ఇక అమెరికాతో చర్చలు

Satyam News

Leave a Comment