శ్రీకాకుళం హోమ్

స్వచ్ఛ శ్రీకాకుళం మన లక్ష్యం

స్వచ్చ శ్రీకాకుళమే మన లక్ష్యమని 31 డివిజన్ ఇంచార్జి, ఏపీ ప్రభుత్వం కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ విభూది సూరిబాబు వెల్లడించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం లో భాగంగా ఈ రోజు స్థానిక దండి వీధిలో సచివాలయం ఉద్యోగులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్చ శ్రీకాకుళం లక్ష్యంగా మనమంతా పనిచేద్దామన్నారు. పరిసరాలను పరిశుభ్రం గా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. పరిసరాల్లో వున్న పిచ్చి మొక్కలు, చెత్త తొలగింపు కార్యక్రమం ను ఎప్పటి కప్పుడు చేపట్టాలని సచివాలయం సిబ్బంది కి సూచించారు.

స్ధానిక ఎమ్మెల్యే గొండు శంక‌ర్ సూచ‌న‌లు, స‌హాకారంతో డివిజ‌న్‌లో ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్న‌ట్లు తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ది ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌న్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్‌ సిటీ లో మొత్తం ఎన్ని గణేష్ విగ్రహాలు ఉన్నాయో తెలుసా?

Satyam News

ఐ బొమ్మ ఆగినా పైరసీ ఆగలేదు…

Satyam News

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ ఎందుకు?

Satyam News

Leave a Comment

error: Content is protected !!