అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ (ఆశ్రా) జాతీయ సదస్సు డిసెంబర్ 6 న విజయవాడ లో జరగనుంది. అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు, బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అశ్రా సేవలను కొనియాడారు. వినియోగదారుల హక్కులు, విధులపై ప్రజలకు అవగాహన కల్పించటం ముదావహమన్నారు. అలాగే ఆమదాలవలస శాసన సభ్యులు, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ కూడా అశ్రా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో అశ్రా జిల్లా చైర్మన్ డాక్టర్ గంజి ఎజ్రా, కమిటీ సభ్యులు అడ్వకేట్ D రాంబాబు, అడ్వకేట్ సారథి, బాల కృష్ణ, జాప్ జిల్లా అధ్యక్షులు జి షణ్ముఖ తదితర సభ్యులు పాల్గొన్నారు.
previous post
next post
Satyam News
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
