అంతర్ రాష్ట్ర చోరీ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరులో ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే వ్యాన్ నుంచి రూ.7.1 కోట్లు కాజేసిన ముఠాలో ముగ్గురు నిందితులు హైదరాబాద్ పోలీసులకు చిక్కడం సంచలనం కలిగించింది. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సిటీ పోలీసుల సహకారంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం హైదరాబాద్ వచ్చిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు వీరి నుంచి రూ.53 లక్షలు రికవరీ చేసిన పోలీసులు బెంగళూరుకు తరలించారు. సినీ పక్కి లో చోటు చేసుకున్న ఈ దోపిడీ బెంగళూరు తో పాటు వివిధ రాష్ట్రాలలో సంచలనం కేసుగా అయ్యింది.
previous post
