సీలైన్ సర్వీస్ సంస్థ ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కాకినాడ జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు మరియు రాజన్ ఏవియేషన్ చైర్మన్ సి ఎస్ నాయుడు అన్నారు.
కాకినాడ గుడారి గుంటలోని ల్యాండ్ మార్క్ రెసిడెన్సి మూడో అంతస్తులు కొత్తగా ప్రారంభిస్తున్న సిలైన్ సర్వీసెస్ సంస్థ ఎండి గరగ స్వామిని కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టు కార్యక్రమాలను అడిగి తెలుసుకుని ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఇటువంటి కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తామని, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు.
