వైసీపీ నేత వేధింపులపై మహిళలు ఎస్పికి పిర్యాదు చేశారు. వైసీపీ నేత వడ్డే పెద్దన్న అసభ్యంగా ప్రవర్తించడంటూ అనంతపురం ఎస్పి జగదీశ్ కు మహిళలు పిర్యాదు చేసారు. అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామం మటన్ మార్కెట్ కాలనిలో నిత్యం బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.
బహిర్భుమికి వెళ్లిన సమయంలో ఫోటోలు తీసి ఇబ్బందులు పెడుతున్నాడని పిర్యాదులో పేర్కొనట్లు వారు తెలిపారు. సదరు బాధితులు ప్రశ్నిస్తే రఫ్ఫా రఫ్ఫా నరుకుతా అంటూ బెదిరిస్తునట్లు ఆవేదన వ్యక్తం చేసారు.
