తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారనే వార్తలు వైరల్ అవుతుండగా, తాజాగా వారి కుమారుడు జాసన్ సంజయ్ తీసుకున్న ఒక నిర్ణయం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది.
గత కొన్ని రోజులుగా విజయ్ మరియు ఆయన భార్య సంగీత విడిపోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో, జాసన్ సంజయ్ తన తండ్రి విజయ్ను ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశారంటూ నెట్టింట స్క్రీన్ షాట్లు చక్కర్లు కొడుతున్నాయి. జాసన్ తన తల్లికి మద్దతుగా నిలుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు భావిస్తున్నారు. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది నెటిజన్లు జాసన్ మొదటి నుంచీ తన తండ్రిని ఫాలో చేయడం లేదని, ఇప్పుడు కావాలనే ఈ వార్తను తెరపైకి తెచ్చారని వాదిస్తున్నారు.
విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఆ పిటిషన్లో ఆమె విజయ్పై సంచలన ఆరోపణలు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, దీనివల్ల తమ 27 ఏళ్ల వైవాహిక బంధం దెబ్బతిన్నదని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.
2021 నుండి విజయ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారని, ఆయన ప్రవర్తన వల్ల పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆమె తన ఫిర్యాదులో వివరించినట్లు సమాచారం.
ఈ పరిణామాలన్నీ విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసిన తరుణంలో జరగడం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతానికి విజయ్ కానీ, సంగీత కానీ లేదా జాసన్ సంజయ్ కానీ ఈ వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచే విజయ్, ఈ వివాదంపై స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.
మరోవైపు, జాసన్ సంజయ్ ప్రస్తుతం దర్శకుడిగా తన తొలి చిత్రం ‘సిగ్మా’ (సందీప్ కిషన్ హీరో) పనుల్లో బిజీగా ఉన్నారు. విజయ్ కూడా తన చివరి చిత్రం ‘జననాయగన్’ షూటింగ్లో నిమగ్నమై ఉన్నారు.
