అనంతపురంహోమ్

శ్త్రీ శక్తి డిజిటల్ మహానాడుకు అనంతపురంలో ఘన ఏర్పాట్లు

#VenkateshPrasadMLA

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పిలుపునిచ్చారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గ అబ్జర్వర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన మాట్లాడుతూ, మే 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో శ్త్రీ శక్తి డిజిటల్ మహానాడు థీమ్‌తో మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి క్లస్టర్ పరిధిలో కనీసం 500 మంది కార్యకర్తలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్న ఈ మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని కోరారు. అనంతపురం జిల్లా టిడిపికి కంచుకోట అని పేర్కొంటూ, పార్టీ నిబంధనలు, సూచనలు పాటిస్తూ కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని అన్నారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాల సాధనకే మహానాడు వేదిక కావాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంతపురం అర్బన్ టిడిపి ప్రెసిడెంట్ సుధాకర్  పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

నరేంద్రమోడీపై పోటీకి ప్రవీణ్ ప్రకాష్ సిద్ధం?

Satyam News

ఇంద్రకీలాద్రిపై భక్తులను అలరించిన ‘కూచిపూడి నృత్య ప్రదర్శన’

Satyam News

“కోవా బన్” వలీకి అండగా మంత్రి లోకేష్ !

Satyam News

అనంతపురం యాపిల్స్‌.. . షిమ్లాకి పోటీగా సీమ రేగిపండ్లు

Satyam News

మే 15న థియేటర్లలోకి ‘రాక్షసపురం’

Satyam News

ఉత్తరాంధ్రకు ప్రధాని ఇచ్చిన వరాలు ఏవీ..?

Satyam News

Leave a Comment