ముస్లిం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ద్యేయమని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. ఆదివారం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జెండా చెట్టు వద్ద ఉన్న మసీదులో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ ప్రార్థన కార్యక్రమంలో పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు షేక్. జానీ సైదా, పలువురు కూటమి పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. అనంతరం ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు షాదీఖానలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
