గుంటూరుహోమ్

పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జూలకంటి

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి హాజరయ్యారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆ మహనీయుడు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆయన చూపిన త్యాగస్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, యువజన సంఘం సభ్యులు, మహిళా సంఘం ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Related posts

AI సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎం లు

Satyam News

మమతా బెనర్జీ ప్రభుత్వం డిస్మిస్ చేసిన గవర్నర్

Satyam News

కోటప్పకొండ తిరునాళ్లకు రూ.30 లక్షలు మంజూరు

Satyam News

గాయ‌త్రి గోశాల‌కు మొద‌టి జీతం రూ.1,16,116లు విరాళం

Satyam News

ఆసుపత్రిలో చేరిన సల్మాన్ ఖాన్ తండ్రి

Satyam News

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త

Satyam News

Leave a Comment