రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పల్నాడు జిల్లా నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలోని ఏ వార్డులోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటమే మన ప్రాధాన్యత అని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు.
పట్టణ ప్రజల అవసరాల నిమిత్తం ముందస్తు చర్యగా చెరువులను పూర్తిస్థాయిలో నింపాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మున్సిపల్ డిఈతో కలిసి నగరికల్లు సమీపంలోని నకరికల్లు చెరువు, శాంతి నగర్ వద్ద ఉన్న చెరువులను, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను కూడా పరిశీలించారు.
పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యాన్ని నింపి ఆగస్టు వరకు పట్టణ ప్రజలకు రెండు పుట్ల నీటిని అందిస్తామని తెలియజేశారు. ఎక్కడా సాంకేతిక లోపాలు తలెత్తకుండా, పంపింగ్ వ్యవస్థను సిద్ధం చేసి నీటి నిల్వలను పెంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి రవి, మడక ప్రసాద్, వేముల పాండు , మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
