30.2 C
Hyderabad
September 16, 2026
జాతీయంహోమ్

ఖర్గే తో భేటీ అయిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి వేం నరేందర్ రెడ్డి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా నూతన ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖర్గే ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, బలరాం నాయక్ కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఖర్గేకు వివరించారు.

Related posts

డిజిటల్ అరెస్టు మోసాలకు రూ.54 వేల కోట్లు హాంఫట్

Satyam News

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

Satyam News

శ్రీ దర్బార్ మైసమ్మకు పట్టువస్త్రాల సమర్పణ

Satyam News

గణనీయంగా తగ్గిన దుబాయ్ ప్రయాణీకుల సంఖ్య

Satyam News

పాషాణాలను సైతం కరిగించిన కథ!

Satyam News

విమానం కూలి అజిత్ పవర్ మృతి

Satyam News

Leave a Comment