జాతీయంహోమ్

ఖర్గే తో భేటీ అయిన రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి వేం నరేందర్ రెడ్డి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా నూతన ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖర్గే ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, బలరాం నాయక్ కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఖర్గేకు వివరించారు.

Related posts

హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..? బిల్ గేట్స్ పలకరింపు

Satyam News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్‌ కు సర్వం సన్నద్ధం

Satyam News

బ్రెజిల్ లో లిథియం మైనింగ్ కి సింగరేణి

Satyam News

వార్ రూమ్ నుంచి మరువలేని సాయం

Satyam News

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో భారీ అవినీతి

Satyam News

బకారంలో రేవ్ పార్టీ భగ్నం చేసిన పోలీసులు

Satyam News

Leave a Comment