భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జస్టిస్ సూర్యకాంత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. శంషాబాద్ లోని హోటల్ నోవాటెల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేశారు.
విందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ఇతర న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
