25.2 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

వేసవిలో నీటి తొట్టెల ద్వారా పశువులకు తాగునీరు

#cattle

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక అనుసంధానంతో  గ్రామీణ ప్రాంతాలలో నీటి తొట్టెలను నిర్మించి, వేసవిలో పశువులకు తాగునీటి వసతి కల్పించడం జరిగిందని పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి దామోదర్ నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వేసవి కాలంలో పశువులు, జీవాల నీటి కొరతను అధిగమించడానికి పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నీటి తొట్టెలను నిర్మించి త్రాగునీటి వసతి కల్పించామన్నారు.

ఈ తొట్టెల్లో నీటి నిర్వహణను స్థానిక పంచాయితీ రాజ్, పశుసంవర్ధక శాఖ  సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నారన్నారన్నారు. శాఖలను సమన్వయం చేసుకుంటూ, స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతల సహకారం కూడా తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించామన్నారు.

​పశుపోషకులు, స్వయం సహాయక సంఘాల వారు, అవసరమైన ప్రాంతాలలో నీటి తొట్టెల ఏర్పాటు కోసం స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో గానీ లేదా పశువైద్యశాలలో గానీ సంప్రదించాలని పశుసంవర్ధక శాఖ  సంచాలకులు డా. టి దామోదర్ నాయుడు ఆ ప్రకటనలో తెలిపారు.

Related posts

జమ్మూలో బీజేపీ అభ్యర్ధి ఘన విజయం

Satyam News

గల్ఫ్ యుద్ధ నేపథ్యంలో భారీగా పతనమైన రూపాయి

Satyam News

సిద్ధరామయ్య రాజీనామా: డీ కే కు ఇక లైన్ క్లియర్

Satyam News

యాదగిరిగుట్టలో వేదపాఠశాలకు శంకుస్థాపన

Satyam News

లండన్ లో ఎండల తీవ్రత: అల్లాడిపోతున్న జనం

Satyam News

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు

Satyam News

Leave a Comment