ఆధ్యాత్మికంహోమ్

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు

#Indrakeeladri

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో గత మూడు రోజులుగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ముగిశాయి. లోక కల్యాణం కోసం, విశ్వశాంతి కోసం చేపట్టిన ఈ పవిత్ర క్రతువు భక్తుల జయజయధ్వానాల మధ్య, వేద మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా ముగింపు వేడుకలు జరిగాయి.

ఆదివారం ఉదయం యాగశాలలో మంటప పూజలు, మూలమంత్ర హవనములతో కార్యక్రమం ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు నిర్వహించిన పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమైంది. అనంతరం నిర్ణీత మేష లగ్న పుష్కర ముహూర్తాన (ఉదయం 9:34 నిమిషాలకు) శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి అమృత హస్తాలతో ప్రధాన ఆలయ శిఖర విమానగోపురమునకు కుంభాభిషేకం నిర్వహించారు

అనేక పుణ్యనదుల జలాలు, సముద్రోదకములతో నిర్వహించిన ఈ సంప్రోక్షణ తిలకించి భక్తులు పులకించిపోయారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. ఎం. హరిజవహర్ లాల్, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్  బొర్రా రాధాకృష్ణ (గాంధీ)  కార్యనిర్వహణాధికారి  వి.కె. శీనా నాయక్   దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వారితో పాటుగా ఆలయ ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు  వేద పండితులు ఈ మహత్తర క్రతువులో పాల్గొని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

జగద్గురువుల అనుగ్రహ భాషణము

కుంభాభిషేకం అనంతరం రాజగోపురం ప్రాంగణంలోని కళావేదికపై కంచి స్వామివారు అనుగ్రహ భాషణము చేశారు  కుంభాభిషేకం  విశిష్టతను, 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ క్రతువు వల్ల కలిగే ఆధ్యాత్మిక శక్తిని భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు  వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా మంత్రి  ఆనం రామనారాయణ రెడ్డి  మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, కుంభాభిషేకం ద్వారా ఆలయ తేజస్సు మరింత పెరిగిందని అన్నారు.

Related posts

యూ టర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

Satyam News

రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

Satyam News

ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Satyam News

మరో కన్నడ చిత్రంలో నటిస్తున్న డాక్టర్ పిసి ఆదిత్య

Satyam News

విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ హెల్త్ పోర్టల్

Satyam News

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

Satyam News

Leave a Comment