బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు తన ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తాము పడుతున్న కష్టాల గురించి కేటీఆర్ కు వివరించారు.
మార్కెట్ యార్డును కేటీఆర్ సందర్శించిన సందర్భంగా ఆయన వెంట బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి,మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్,మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి,చల్లా ధర్మారెడ్డి తదితర నాయకులు ఉన్నారు.
