హైదరాబాద్హోమ్

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి

పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా హైదరాబాద్ లో మౌలిక సదుపాయాలు కల్పన దిశగా సీఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎల్లారెడ్డి గూడ జయప్రకాష్ నగర్ కాలనీ, ఇంజనీర్స్ కాలనీలో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ హైదరాబాద్ విశ్వ నగరం అజెండాగా అభివృద్రి చేయాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు.

జూబ్లీ హిల్స్ నియోజక వర్గంలో ప్రతి డివిజన్ లో సీసీ రోడ్లు ,పార్క్ లు తాగునీటి సరఫరా డ్రైనేజ్ వ్యవస్థ శానిటేషన్ తో క్లీన్ అండ్ గ్రీన్ గా కాలనీలు ఉంచి ,పరిశుభ్రత పాటిస్తూ మెరుగైన జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.హైదరాబాద్ నగర అబివృద్ధి కొనసాగేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ,మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కార్పొరేటర్ సంగీత స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Related posts

పాకిస్థాన్ జెట్ ను కూల్చిన తాలిబాన్లు

Satyam News

అలీ లారిజానీ అంతిమ యాత్రలో కోట్లాది మంది….

Satyam News

థాయ్‌లాండ్–హైదరాబాద్ డ్రగ్స్ లింక్ బట్టబయలు

Satyam News

ఏపీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ C4IR కేంద్రం

Satyam News

ఫిలిప్పీన్స్ ను వణికించిన భారీ భూకంపం

Satyam News

మహోజ్వలంగా వెలగనున్న బాసర శ్రీ సరస్వతీ దేవాలయం

Satyam News

Leave a Comment