25.2 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

నరసరావుపేటలో “ఆవో ఉర్దూ సీఖే “

#Dr.AravindBabu

రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నరసరావుపేట 15వ వార్డులో ఆవో ఉర్దూ సీఖే …. రండి ఉర్దూ నేర్చుకుందాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత ఉర్దూ మెటీరియల్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు చేతుల మీదుగా విద్యార్థులకు, ఔత్సాహికులకు ఉర్దూ పుస్తకాలను పంపిణీ చేశారు. ఉర్దూ భాష నేర్చుకోవడం ద్వారా సాంస్కృతిక ఐక్యత పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఉర్దూ అకాడమీ ద్వారా ఉచితంగా అందిస్తున్న ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఫిరోజ్, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అంజుమన్ కమిటీ సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు.

Related posts

రోయింగ్ చాంపియన్ షిప్ లో సత్తా చాటిన తెలంగాణ

Satyam News

48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి

Satyam News

నారా లోకేష్ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్

Satyam News

గ్రహణం రోజున ముస్లింల ర్యాలీ…!

Satyam News

కోటప్పకొండ తిరునాళ్ళు సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు

Satyam News

వనపర్తి మున్సిపల్ చైర్మన్ సీటులో పోటీ

Satyam News

Leave a Comment