గుంటూరుహోమ్

నరసరావుపేటలో “ఆవో ఉర్దూ సీఖే “

#Dr.AravindBabu

రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నరసరావుపేట 15వ వార్డులో ఆవో ఉర్దూ సీఖే …. రండి ఉర్దూ నేర్చుకుందాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత ఉర్దూ మెటీరియల్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు చేతుల మీదుగా విద్యార్థులకు, ఔత్సాహికులకు ఉర్దూ పుస్తకాలను పంపిణీ చేశారు. ఉర్దూ భాష నేర్చుకోవడం ద్వారా సాంస్కృతిక ఐక్యత పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఉర్దూ అకాడమీ ద్వారా ఉచితంగా అందిస్తున్న ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఫిరోజ్, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అంజుమన్ కమిటీ సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు.

Related posts

అరకులోయలో యూ టీ ఎఫ్ రణభేరి

Satyam News

యువ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

Satyam News

గల్ఫ్ లో చిక్కుకున్న వారికి ఏపీ ప్రభుత్వ సహాయం

Satyam News

స్వీయ జనగణన ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు

Satyam News

ఇరాన్ రక్షణ వ్యవస్థ పై అమెరికా భీకర దాడులు

Satyam News

పొలాల్లో విష పురుగులు ఉంటాయి జాగ్రత్త !

Satyam News

Leave a Comment