26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

నరసరావుపేటలో “ఆవో ఉర్దూ సీఖే “

#Dr.AravindBabu

రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో నరసరావుపేట 15వ వార్డులో ఆవో ఉర్దూ సీఖే …. రండి ఉర్దూ నేర్చుకుందాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత ఉర్దూ మెటీరియల్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు చేతుల మీదుగా విద్యార్థులకు, ఔత్సాహికులకు ఉర్దూ పుస్తకాలను పంపిణీ చేశారు. ఉర్దూ భాష నేర్చుకోవడం ద్వారా సాంస్కృతిక ఐక్యత పెరుగుతుందని, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఉర్దూ అకాడమీ ద్వారా ఉచితంగా అందిస్తున్న ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఫిరోజ్, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అంజుమన్ కమిటీ సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న స్వామీజీ

Satyam News

రేపటిలోగా డీజిల్, పెట్రోల్ సప్లయ్ పెరగాలి

Satyam News

గ్రేటర్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సీక్రెట్ సర్వే

Satyam News

గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్‌లో తేనీటి విందు

Satyam News

చెల్లని చెక్కు కేసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి జైలు

Satyam News

తిరుమల కిట కిట.. జగన్‌ కట కట..!!

Satyam News

Leave a Comment